ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణంకు ఆదివారం ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి రాత్రి 7.45 గంటలకు బయల్దేరి(రైలు నెం. 07097) మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖ పట్టణం చేరుకుంటుంది. అలాగే, ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లకు అదనంగా ఒక్కో బోగీని జత చేస్తున్నట్లు తెలిపింది.