విషాదం.. మృతదేహాలను చూసిన కానిస్టేబుల్ కు గుండెపోటు

82చూసినవారు
విషాదం.. మృతదేహాలను చూసిన కానిస్టేబుల్ కు గుండెపోటు
యూపీ హత్రాస్‌ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. అక్కడ సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో వందకు పైగా భక్తులు మరణించారు. అయితే అక్కడి ఎటా మెడికల్ కాలేజీలో మృతదేహాలు నేలపై కుప్పలుగా పడి ఉన్నాయి. ఇక్కడికి క్విక్ రెస్పాన్స్ టీమ్(QRT)లో అత్యవసర డ్యూటీ కోసం పోలీస్ కానిస్టేబుల్ రజనీశ్(30) హాజరయ్యాడు. అయితే అక్కడ పదుల సంఖ్యలో మృతదేహాలను చూసి తట్టుకోలేక గుండెపోటుకు గురై రజనీశ్ ప్రాణాలను వదిలాడు.

సంబంధిత పోస్ట్