ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది. అయితే నామినేషన్ దాఖలు చేసిన కొద్ది సేపటికే ఓ అభ్యర్థిపై కేసు నమోదైంది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ అభ్యర్థికి ఈ వింత అనుభవం ఎదురైంది. టీడీపీ తరుఫున పల్లె సింధూర రెడ్డి పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేసిన తర్వాత ఆర్వో కార్యాలయం వద్దే సింధూర రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. అనంతరం రోడ్ షో నిర్వహించారు. దీనిపై పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఫిర్యాదు మేరకు పల్లె సింధూర రెడ్డి మీద కేసు నమోదైంది.