కేంద్రానికి మన ఎంపీల అవసరం పడాలి: అమర్నాథ్

74చూసినవారు
AP: కేంద్రంలో ఎవరికి మెజారిటీ సీట్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేద‌ని వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. వైసీపీ ఎంపీల మద్దతు.. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి అవసరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపారు. ఏ కూటమికైనా మెజార్టీ మార్క్‌లోపే సీట్లు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేరుస్తామంటేనే ఎన్డీఏ, యూపీఏలో ఏ కూటమికైనా మద్దతు ఇస్తామ‌ని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్