AP: రాష్ట్రంలో ఈ నెల 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపునకు చేపట్టాల్సిన చర్యలపై రిటర్నింగ్ అధికారులతో సీఈవో ముఖేశ్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్, పోస్టల్ బ్యాలట్ల లెక్కింపు, ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపునకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబులేషన్, ఎన్కోర్లో ఫీడ్ చేయడం వంటి అంశాలపై పలు సూచనలు చేశారు.