చెత్త పన్ను వసూళ్లు నిలిపివేత

71చూసినవారు
చెత్త పన్ను వసూళ్లు నిలిపివేత
ఏపీలోని నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూళ్లు నిలిపివేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వసూలు చేయొద్దని పుర, నగరపాలక సంస్థలకు అధికారులు ఆదేశాలిచ్చారు. అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీనిచ్చారు. ఎన్డీఏ అధికారంలోకి రావడంతో వసూళ్లు నిలిపివేయాలని వార్డు సచివాలయాలకు పుర కమిషనర్లు సూచించారు.

సంబంధిత పోస్ట్