ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో నేతలు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడిగా ప్రచారం చేయనున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇరువురు నేతలు పర్యటించనున్నారు. 10వ తేదీన తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో.. 11వ తేదీన పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో వీరు ప్రచారం నిర్వహించనున్నారు.