హిమాచల్ ప్రదేశ్లోని ఉనా జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హరోలిలోని తహ్లీవాల్లో పెట్రోల్ నింపిన ట్యాంకర్ ఒక్కసారిగా అదుపు తప్పి మార్గమధ్యలో బోల్తా పడింది. ట్యాంకర్ బోల్తా పడిన వెంటనే మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడినట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.