ఏపీ ప్రజలకు
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక పిలుపునిచ్చారు. శనివారం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘
జగన్ ఫోటో ఉన్న పాసు పుస్తకాల కాపీలను ప్రజలు దహనం చేయండి. సాయంత్రం 4 గంటలకు వీధుల్లోకి వచ్చి కాపీలు తగలబెట్టాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాం. పట్టాదారు పాసు పుస్తకాలపై
జగన్ బొమ్మలు ఎందుకు? ప్రజా ప్రభుత్వం రాగానే రాజముద్ర వేసి పాసు పుస్తకాలు అందిస్తాం.’ అని అన్నారు.