రేపటి నుంచి ఏపీలో ఆధార్ క్యాంపులు

79చూసినవారు
రేపటి నుంచి ఏపీలో ఆధార్ క్యాంపులు
ఏపీలో రేపటి నుంచి ఈ నెల 5 వరకు ఆధార్ ప్రత్యేక క్యాంపులు జరగనున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాలు, కాలేజీలు, స్కూళ్లు, అంగన్వాడీ సెంటర్లలో నాలుగు రోజుల పాటు ఈ క్యాంపులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్యాంపుల్లో కొత్త ఆధార్ కార్డులు, బయోమెట్రిక్ అప్‌డేట్, డెమోగ్రాఫిక్ అప్‌డేట్, ఈ-ఆధార్ వంటి సేవలందించనున్నారు. రాష్ట్ర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

సంబంధిత పోస్ట్