ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. "రాష్ట్ర ప్రభుత్వం ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ వ్యవహారాన్ని నిలిపివేయాలి. కొత్త ప్రభుత్వం వస్తోన్న వేళ దాన్ని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ-ఆఫీస్ వ్యవహారంలో అక్రమాలు జరిగే అవకాశం ఉంది." అని ఆయన లేఖలో పేర్కొన్నారు. మే 17 నుంచి 25 వరకు అప్గ్రేడ్ పేరుతో ఈ-ఆఫీస్ మూసివేత నేపథ్యంలో గవర్నర్కు చంద్రబాబు ఈ లేఖను రాశారు.