ఢిల్లీ మద్యం స్కాం కేసులో నిందితుడిగా ఉన్న సీఎం కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరులో మినహాయింపు లభించిందని కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ తీర్పుపై విమర్శలను, విశ్లేషణను స్వాగతిస్తున్నామని తెలిపింది. ‘‘కేజ్రీవాల్ జైలులో ఎప్పుడు లొంగిపోవాలో మా ఆదేశాల్లో స్పష్టంగా ఉంది. ఇది సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం. చట్టపాలన సమానత్వంతో ఉంటుంది. మేం ఎవ్వరికీ మినహాయింపు ఇవ్వలేదు’’ అని స్పష్టంచేసింది.