AP: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఏపీకి ఆర్థిక సాయం, విభజన హామీలను షా దృష్టికి సీఎం తీసుకెళ్లారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి నిధులు సకాలంలో అందించాలని విజ్ఞప్తి చేశారు.