ఉచిత ఇసుకపై దుష్ప్రచారం.. సీఎం చంద్రబాబు ఆగ్రహం

57చూసినవారు
ఉచిత ఇసుకపై దుష్ప్రచారం.. సీఎం చంద్రబాబు ఆగ్రహం
ఉచిత ఇసుకపై సామాజిక మాధ్యమాల వేదికగా సాగుతున్న అసత్య ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన చర్యలకు వెనుకాడొద్దని గనులశాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌మీనాకు ఆదేశాలిచ్చారు. ప్రజల్ని తప్పుదారి పట్టించేలా సాగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని మీనాను ఆదేశించారు. ఉచిత ఇసుకపై ఉద్దేశపూర్వకంగా ప్రజల్లో అనుమానాలు రేకెత్తేలా ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఈ తరహా వ్యవహారాల పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్