AP: సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన ఖరారైంది. సీఎంగా తొలి క్షేత్రస్థాయి పర్యటనను ఆయన పోలవరం నుంచే ప్రారంభించనున్నారు. ఈ నెల 17న(సోమవారం) పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు చంద్రబాబు వెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్టు స్థితిని పరిశీలించనున్నారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చలు జరపనున్నారు.