దెందులూరులోని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభకు వంగవీటి రాధాకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 'ప్రజలకు సిన్సియర్ గా ఏదో చేయాలనే తపన ఉన్న నేత రాధా. ఏమీ కోరడు మామూలుగా అయితే చాలా మంది తండ్రి పేరు చెప్పుకుని పదవులు ఆశిస్తారు. రాధాకృష్ణ మాత్రం నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఆయనకు తప్పకుండా తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత నాది' అంటూ చంద్రబాబు అన్నారు.