ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆయా పథకాల పేర్లను మార్పు చేస్తున్నారు. చేయాలి కూడా. కానీ అలా మార్చిన వాటికి తమ పార్టీ గుర్తుకు వచ్చేలా పేర్లు పెట్టుకోవడం మొదలైంది. ఈసారి జనసేన కీలకంగా ఉంది. దాంతో పథకాల పేర్ల విషయంలో టీడీపీ- జనసేనల మధ్యన పేచీ వస్తోందని అంటున్నారు. నిజానికి కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ముందుగా పథకాల పేర్లనే పెద్ద ఎత్తున మార్చుకుంటూ పోతున్నారు. అది ఒక భారీ కార్యక్రమంగా సాగుతోంది.