జగన్ బెంగళూరులో తాను ఒకనాడు కట్టించుకున్న 27 ఎకరాల సువిశాలమైన యలహంక ప్యాలెస్ లో రెస్ట్ మోడ్ లో ఉంటున్నారు. జగన్ ఈ ప్యాలెస్ కట్టించుకున్న తరువాత పట్టుమని పది రోజులు కూడా గడపలేదని అంటున్నారు. ఆయనకు ఆ చాన్స్ ఇపుడు వచ్చింది అని అంటున్నారు. జగన్ పులివెందుల నుంచి నేరుగా బెంగళూరు వెళ్లిపోయారు. అయితే జగన్ ఈ ప్యాలెస్ వేదికగా బెంగళూరులో కాంగ్రెస్ నాయకులతో సమావేశమవుతున్నట్లు సమాచారం. తన సొంత చెల్లెలు షర్మిలతో సెటిల్మెంట్ చేయమని జగన్ డీకేని కోరినట్లు కథనాలు వస్తున్నాయి.