ఎవరైనా దాడులకు పాల్పడితే సహించేది లేదు: సీఐ

76చూసినవారు
చిత్తూరు జిల్లా కేంద్రంలో ఎన్నికల ఫలితాలు అనంతరం దాడుల పరంపర కొనసాగుతోందని వన్ టౌన్ సీఐ విశ్వనాథరెడ్డి శనివారం తెలిపారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశానుసారం దాడులకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చిత్తూరు శాంతి, సహనాలకు నిలయం అన్నారు. కక్షపూరిత వాతావరణాన్ని సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్