ఓటమి పై వైసీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఆ నెపాన్ని ప్రజలపై నెట్టడం బాధాకరమని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్రకుమార్ గురువారం విమర్శించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో చిత్తుగా ఓటమిపాలైన మాజీ సీఎం జగన్ ఈవీఎంలపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఎవరో ఏమో చేశారని, కానీ అందుకు ఆధారాలు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.