మద్యం షాపుల టెండర్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది: ఎస్పీ

58చూసినవారు
చిత్తూరు నగరంలోని సంతపేట ఆర్ఆర్ గార్డెన్లో పారదర్శకంగా నూతన మద్యం షాపుల టెండర్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు సోమవారం తెలిపారు. 104 మద్యం షాపులకు లాటరీ తీసి షాపులు కేటాయించినట్లు చెప్పారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో టెండర్ పూర్తి చేసేలా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్