ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

1084చూసినవారు
ఎస్ఆర్ పురం మండలం, తయ్యూరు పంచాయతీ, పెద్దతయ్యూరు గ్రామం మీదుగా ఎస్సై రాజుకుల్లయ్యప్ప ఆధ్వర్యంలో ఆదివారం కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అసాంఘిక శక్తులకు ముందస్తు హెచ్చరికగా కేంద్ర బలగాలతో కవాతు ను ఉన్నత అధికారులు ఆదేశాలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్సై తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్