ప్రజా ధనం నీటి పాలు

568చూసినవారు
కుప్పం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం పక్కనే తాగునీటి పైప్ లైన్ నుండి నీరు రోడ్డుపై వృధాగా పోతోందని స్థానికులు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా నీరు వృధాగా పోతున్నా సంభందిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు తెలిపారు. నిత్యం ప్రభుత్వ అధికారులు రాకపోకలు సాగించే మార్గంలోనే మంచినీరు వృధాగా పోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు‌. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్