రెస్కో అవకతవకలపై విచారణ చేపట్టిన శ్రీలక్ష్మీ

77చూసినవారు
కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంఘంలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై గురువారం విచారణ అధికారిణి శ్రీలక్ష్మీ నేతృత్వంలో విచారణ చేపట్టారు. 30 అంశాలకు సంభందించిన రికార్డులను శ్రీలక్ష్మీ పరిశీలిస్తున్నారు. విచారణ అనంతరం నివేదికను కమిషనర్ కు అందజేయనున్నారు. ప్రధానంగా ఉద్యోగ కల్పన, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లపై ఆమె ఆరా తీస్తున్నట్లు సమాచారం. శ్రీలక్ష్మీ విచారణతో అక్రమార్కుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి.

సంబంధిత పోస్ట్