భక్తి శ్రద్ధల నడుమ పౌర్ణమి పూజలు

54చూసినవారు
భక్తి శ్రద్ధల నడుమ పౌర్ణమి పూజలు
నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు బుధవారం పౌర్ణమి పూజలు ఘనంగా జరిగింది. ఉదయం సుప్రభాతం, అభిషేకం, హోమం పూర్ణాహుతి భక్తుల నడుమ అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రూపేష్ క్రిష్ణ ఆచార్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.

సంబంధిత పోస్ట్