వికోట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ విష్ణు రఘువీర్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పాపేపల్లి జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తున్న సీఐ లింగప్ప, ఎస్ఐ బాబు వారి బృందంతో తనిఖీలు చేశారు. బైకు దొంగతనాలకు పాల్పడుతున్నారని ఇరువురిని తమదైన శైలిలో విచారించగా తమిళనాడులోని పెర్నంబెట్ సమీపంలో 9 బైకులను దాచిపెట్టారని ఆంగీకరించినట్లు తెలిపారు.