పలమనేరులో జరిగిన రోడ్ షోలో సీఎం జగన్ పై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సోమవారం తీవ్ర విమర్శలు చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఇవ్వలేదని, సీపీఎస్ రద్దు చేస్తానని చేయలేదని మెగా డీఎస్సీ అన్నావు ఇప్పటి వరకూ ఆ ఊసే లేదని మద్యపాన నిషేధమని చెప్పి నాసిరకం జే బ్రాండ్లు అమ్ముతున్నావు అన్నారు. ఏం అభివృద్ది చేయకుండా ఓటు ఎలా అడుగుతావు జగన్ రెడ్డి అని ప్రశ్నించారు.