దేశంలో అత్యుత్తమ సంస్థల జాబితాను ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ వేదిక లింక్డ్ఇన్ విడుదల చేసింది. టాప్-25 కంపెనీలతో విడుదలైన ఈ వార్షిక లిస్టులో భారతీయ ఐటీ రంగ దిగ్గజం టీసీఎస్ అగ్రస్థానంలో నిలిచింది. పని చేయడానికి ఉద్యోగులకు అత్యంత అనువైన కంపెనీగా టీసీఎస్ను మించినది భారత్లో మరొకటి లేదని లింక్డ్ఇన్ తేల్చింది. విదేశీ ఐటీ కంపెనీలైన యాక్సెంచర్, కాగ్నిజెంట్ వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నాయి.