పూతలపట్టు నియోజకవర్గం గుడిపాల మండలంలో శనివారం సాయంత్రం భారీ కురిసిన వర్షానికి కుప్పిగాని పలికి చెందిన సుభాషిని అనే మహిళ ఇంటి కప్పు రేకులు గాలికి ఎగిరిపోయి, ఇల్లు చెరువులు తపించింది. మండలంలో పలు ప్రాంతాలలో చెట్లు కూలిపోవడం, కరెంటు స్తంభాలు కూలిపోవడం జరిగింది. సుమారు గంట పాటు కురిసిన వర్షానికి గ్రామం అతలాకుతలమైంది. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.