బక్రీద్ సందర్భంగా భారీగా పెరిగిన ధరలు

70చూసినవారు
బక్రీద్ సందర్భంగా భారీగా పెరిగిన ధరలు
పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో బక్రీద్ సందర్భంగా టమోటా ధరలు భారీగా పెరిగాయి. పట్టణంలోని టమోటా మార్కెట్లో 15 కేజీల బాక్స్ ధర 830 పలికినట్లు రైతులు తెలియజేశారు. తమ కష్టానికి తగిన ఫలితం వస్తుండడంతో ఎంతో సంతోషంగా ఉందని రైతులన్నారు. గత మూడు రోజుల నుంచి ప్రతిరోజు టమోటా ధరలు పెరుగుతున్నాయి. మరికొన్ని రోజులు ఈ ధరలు ఇలానే ఉంటే బాగుంటుందని రైతులు తమ ఆశ భావాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్