బడి ఈడు పిల్లలు బడికి వెళ్లాలి

81చూసినవారు
బడి ఈడు పిల్లలు బడికి వెళ్లాలి
బడి ఈడు పిల్లలందరూ బడులలోనే ఉండాలని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ బాబు, ఎంఈఓ లు సిద్ధరామయ్య, తాతయ్య తెలిపారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన పులిచెర్ల మండలం కల్లూరులోని పలు దుకాణాలను, పెట్రోల్ బంకులు, హోటల్లు, మెకానిక్ షెడ్లలో వారు మంగళవారం తనిఖీ చేశారు. బాల కార్మికులను పనులలో పెట్టుకోరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అషరఫ్, విజయ, అరుణ, ఉమాదేవి, గంగరాజు, సుమలత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్