తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు

78చూసినవారు
తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు
పుంగనూరు నియోజకవర్గంలోని వైష్ణవాలయాలలో తొలి ఏకాదశి సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకొని స్వామివారికి విశేష పూజలను చేశారు. నిర్వాహకులు ఆలయాలను మామిడాకుల తోరణాలతో అలంకరించారు. విష్ణు సహస్రనామ పారాయణంతో పూజా కార్యక్రమాలను ముగించారు. ఓం నమో నారాయణాయ అంటూ భక్తులు పరవశించిపోయారు.

సంబంధిత పోస్ట్