చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని శనివారం తిరుపతి రూరల్ మండలం, రఘునాథ్ రిసార్ట్స్ లోని పార్టీ కార్యాలయంలో "జగనాసుర రక్తచరిత్ర" ఈ ఛార్జ్ షీట్ ను పార్టీ నేతలతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై టిడిపి-జనసేన-బిజెపి కూటమి ఈ ఛార్జ్ షీట్ విడుదల చేయడమైందన్నారు. పెత్తందారీ పాలనలో రాష్ట్రం విధ్వంసమైందని పేర్కొన్నారు.