ఆవుల దొంగకు 6 నెలల జైలు శిక్ష

64చూసినవారు
ఆవుల దొంగకు 6 నెలల జైలు శిక్ష
ఆవుల దొంగకు చిత్తూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఉమాదేవి సోమవారం జైలు శిక్ష విధించారు. బంగారుపాలెం పోలీసుల వివరాల మేరకు, బంగారుపాళ్యం హరిజనవాడలోని మురళి ఇంటి ఆవరణలో ఉన్న ఆవులను 2021 జులైలో అదే ఊరికి చెందిన శైలేష్ చోరీ చేశాడు. ఈ కేసులో కోర్టు పూర్వాపరాలు విచారించి, నేరం రుజువు కావడంతో నిందితుడికి 6నెలల జైలుశిక్ష విధించింది.

సంబంధిత పోస్ట్