చిత్తూరు దర్గా సర్కిల్ నుంచి కాజూరు వరకు టూ టౌన్ సీఐ నెట్టి కంటయ్య పోలీసుల మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్పీ ఆదేశాల మేరకు ప్రజలకు భరోసా కల్పించడానికి మార్చ్ ఫాస్ట్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు నిర్భయంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.