ఓట్ ఫర్ చిత్తూరు అంటూ చిత్తూరు నగరంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లోని యువ ఓటర్లు చేసిన అక్షర ప్రదర్శన ఆకట్టుకుంది. కలెక్టర్ ఎస్. షన్మోహన్ ఆర్వో, జేసీ పి. శ్రీనివాసులు ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా కమిషనర్ అరుణ మార్గదర్శకంలో శుక్రవారం నగరపాలక స్వీప్ నోడల్ టీం నగరంలోని సీతమ్స్, ఎస్వీ సెట్ ఇంజనీరింగ్ కళాశాలలోని యువ ఓటర్లతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.