తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తేనే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ సతీమణి గురజాల ప్రతిమ అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిమ చిత్తూరు నగరంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.గురువారం చిత్తూరు నగరంలోని కొన్ని ప్రాంతాలలో ప్రతిమతో పాటు టీడీపీ నేతలు, నాయకులు తదితర నేతలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.