ఏపీ సమగ్ర శిక్షా, ఎస్సిఈఆర్టి వారు యునిసెఫ్ సహాయంతో నిర్వహించబోయే రాష్ట్రస్థాయి వర్క్ షాప్ కి వాల్మీకిపురం స్థానిక పివిసి ప్రభుత్వ ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయులు వి. రవీంద్ర రెడ్డి ఎంపికయ్యారు. ఈ నెల 22న విజయవాడ గుణదలలోని సాల్ట్ కార్యాలయంలో వర్క్ షాప్ జరగనుంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో భాగంగా ప్రాణాధారమైన నీరు, పారిశుద్ధ్యం కూడిన నాణ్యమైన విద్య విద్యార్థులకు అందించటంపై కార్యక్రమాలు నిర్వహిస్తారు.