కార్వేటినగరం మండలం, తహశీల్దారు కార్యాలయంలో రెవెన్యూ ఇన్ స్పిక్టర్ గా పని చేస్తున్న రెడ్డప్ప రూ. 12 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. బుధవారం ముందస్తుగా రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెడ్డప్ప పట్టు పడటం జరిగిందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఏఎస్పీ దేవా ప్రసాద్, డీఎస్సీ జెస్సీ ప్రశాంతి పాల్గొన్నారు.