మందుబాబులకు అడ్డాగా ఆర్ అండ్ బీ భవనం

82చూసినవారు
కుప్పం పట్టణంలోని బైపాస్ రోడ్డులోని ఆర్ అండ్ బి భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పగలు రాత్రి తేడా లేకుండా, మందుబాబులు మద్యం సేవిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే చోట ఓ వ్యక్తిని అతికిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్