ఎస్విపురంలో శ్రీ సీతారామ కళ్యాణం

79చూసినవారు
ఎస్విపురంలో శ్రీ సీతారామ కళ్యాణం
వడమాలపేట మండలం ఎస్విపురం గ్రామం నందు శుక్రవారం రామాలయం నందు శ్రీ సీతారామ కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. గ్రామం నందు మహాకుంబాభిషేకం జరిగినప్పటి నుండి మండలం రోజులు గ్రామస్థులు దీక్ష తీసుకున్నారు. గణపతి హోమం, నవగ్రహ హోమం నిర్వహించి దీక్షలు విరమించారు. భక్తులకు అన్నదానం చేశారు. గ్రామ పురవీధులలో శ్రీ సీతా రాముల వారిని ఊరేగించారు.

సంబంధిత పోస్ట్