గంగవరంలో ఉద్రిక్తత..

9983చూసినవారు
గంగవరంలో ఆదివారం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి సోమవారం నామినేషన్ వేయనున్నట్టు గ్రామంలో దండోరా వేశారు. ఈదండోరాను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం జరిగింది. గ్రామాలలో దండోరా వేయడానికి వీల్లేదని వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో రంగప్రవేశం చేసి ఇరు పార్టీల నాయకులకు నచ్చజెప్పి పంపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్