

పలమనేరు: విద్యార్థి మృతి.. డీఎస్పీ చర్చలతో శాంతించిన బంధువులు
గంగవరంలో ఇంటర్ విద్యార్థి యోగేశ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు ఆదివారం ఆరోపించారు. మృతదేహంతో కళాశాల వరకు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో వారితో డీఎస్పీ ప్రభాకర్ చర్చలు జరిపారు. యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తానంటూ హామీ ఇవ్వడంతో బాధితులు వెనుతిరిగారు. కాలేజీ యాజమాన్యం సరైన విధంగా స్పందించకపోవడంతోనే తాము ఆందోళను దిగినట్లు బాధితులు పేర్కొన్నారు.