వైభవంగా వినాయకస్వామి బ్రహ్మోత్సవాలు

76చూసినవారు
చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి స్వామివారిని మూషిక వాహనంపై ఊరేగించారు. కాణిపాకం, తిరువనంపల్లె, అగరంపల్లె, కాణిపాకం పట్నం, వడ్రంపల్లె, కొత్తపల్లె, చిన్నకాం పల్లె గ్రామాలకు చెందిన విశ్వకర్మ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్సవాలకు హాజరవుతున్నారు.

సంబంధిత పోస్ట్