బోల్తా పడిన బొలెరో వాహనం

563చూసినవారు
బోల్తా పడిన బొలెరో వాహనం
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండల పరిధిలోని బంగ్లా సమీపంలో గురువారం బొలెరో వాహనం బోల్తా పడి ఐదు మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు పుంగనూరు వైపు నుంచి ఖాళీ టమేటా బాక్సులతో అతివేగంగా వచ్చిన బొలెరో మలుపులో బోల్తా పడిందని తెలిపారు. గాయపడిన ఐదు మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు ప్రైవేట్ వాహనంలో సోమల పీహెచ్సీ కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్