ఏపీలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి బిజెపి కేంద్ర ప్రభుత్వం 8 కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసిందని మంగళవారం గుర్రంకొండలో జరిగిన సమావేశంలో రాజంపేట పార్లమెంట్ సోషల్ మీడియా కో కన్వీనర్ భరత్ చౌదరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందులో భాగంగా మదనపల్లి పట్టణం దగ్గర వలసపల్లి గ్రామంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుందని తెలిపారు.