పాఠశాలలో పరిశుభ్రతను పాటించాలి

83చూసినవారు
పాఠశాలలో పరిశుభ్రతను పాటించాలి
పాఠశాలలో పరిశుభ్రతను పాటించాలని సచివాలయ సిబ్బంది ఉపాధ్యాయులకు తెలియజేశారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరు ఎంపీపీ పాఠశాలను మంగళవారం సచివాలయ సిబ్బంది పరిశీలించారు. ఈ సందర్భంగా వారు పాఠశాలలోని పరిసరాలను పరిశీలించారు. తాగునీటి సౌకర్యంపై ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్