విష ప్రచారం చేసిన మీడియా సంస్థకు నోటీసులు

75చూసినవారు
విష ప్రచారం చేసిన మీడియా సంస్థకు నోటీసులు
తనపై విష ప్రచారం చేసిన మరో మీడియా సంస్థకు నోటీసులు పంపినట్లు మాజీ మంత్రి , పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ట్విటర్లో శనివారం పేర్కొన్నారు. ఇప్పటికే ఓ న్యూస్ ఛానల్ కు పరువునష్టం కింద రూ. 50 కోట్లకు న్యాయవాదులు నోటీసులు పంపారని పెద్దిరెడ్డి తెలిపారు. నిరాధారంగా వార్తలు రాసిన వారిపై న్యాయ పరంగా కఠినంగా వ్యవహరించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్