పుంగనూరు:గంధం అలంకారంలో శ్రీ విరుపాక్షమ్మ

73చూసినవారు
పుంగనూరు:గంధం అలంకారంలో శ్రీ విరుపాక్షమ్మ
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు గ్రామ దేవత విరుపాక్షమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలలో భాగంగా శనివారం అమ్మవారు గంధం అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయంలో ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు మంజునాథ దీక్షితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉభయదారులుగా కల్లూరు కు చెందిన మునీశ్వర దంపతులు వ్యవహరించారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్