పుంగనూరు మండలంలో పార్టీలకతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేశామని ఎంపీపీ భాస్కర్ రెడ్డి తెలియజేశారు. పుంగనూరు మండల పరిధిలోని భీమ గాని పల్లి పంచాయతీ బాలాజీ కాలనీ లో మంగళవారం స్థానిక నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలోని గడపగడపకు వెళ్లి రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.